ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం : ఆది శ్రీనివాస్

 ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం : ఆది శ్రీనివాస్
  • విప్​ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: ఆరోగ్య తెలంగాణే సర్కార్‌‌‌‌ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ మండల  పరిషత్ ఆఫీస్‌‌లో జరిగిన కార్యక్రమంలో అర్బన్, పట్టణ పరిధిలో అర్హులైన 76 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌, 54 మందికి సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి, ఇత‌‌ర రాష్ట్రాల‌‌కు స్ఫూర్తిదాయ‌‌కంగా మారందన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచారన్నారు. కార్యక్రమంలో లీడర్లు శ్రీనివాస్‌‌గౌడ్​, కనికరపు రాకేశ్‌‌, చిలుక రమేశ్‌‌, పి.రాజు, అజయ్​, రాజు, శ్రీనివాస్, శ్రీధర్, కిరణ్​కుమార్​పాల్గొన్నారు. 

అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు 

చందుర్తి, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌ అన్నారు. శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, రూ.16లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. 

ఆయన మాట్లాడుతూ రైతాంగానికి అండగా నిలిచేందుకు నాణ్యమైన విద్యుత్‌‌ అందిస్తున్నామన్నారు. మండలంలో వ్యవసాయానికి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు లింగంపేట విద్యుత్ సబ్ స్టేషన్ కు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.